శ్రీశైలం పాతాళగంగ మార్గంలో చిరుత సంచారం..!

శ్రీశైలం పాతాళగంగ మార్గంలో చిరుత సంచారం..! శ్రీశైలాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఆలయం అడవిలో ఉండటంతో చిరుతపులులు పదేపదే ఆలయం పరిసరాల్లో తిరుగుతున్నాయి. చివరకు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి. దీంతో స్థానికంగా నివాసం ఉండే వారితోపాటు భక్తులు సైతం తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. శ్రీశైలం చుట్టూ చిరుత పులి చక్కర్లు కొడుతోంది. ఏకంగా శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్ ఇంట్లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులతోపాటు భక్తులు ఉలికిపాటుకు గురయ్యారు.