జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తనకు ఇప్పుడు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. జానారెడ్డిని సీఎం రేవంత్ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన రేవంత్కు జానారెడ్డి దంపతులు శాలువా కప్పి ఆహ్వానించారు. జానారెడ్డి, రేవంత్ మధ్య దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి.