సప్త నదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వరాలయం గత ఏడాది డిసెంబర్ 11వ తేదీ శ్రీశైల జలాశయం కృష్ణా జలాల్లో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జులై 23వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించాయి. దాదాపు 258 రోజులు పాటు భక్తులకు దర్శనమించిన వేపదారు శివలింగాన్ని కృష్ణ జలాలు తాకాయి. గంగమ్మకు చీర సారే సమర్పించి గర్భాలయంలోని వేపదారు శివలింగం కు ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించిన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు.