తాళ్లపాక చెరువులో పురాతన శివలింగం వెలుగు చూసింది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు జన్మించిన స్థలంలో వెలిసిన ఈ శివలింగానికి విశేష చారిత్రక ప్రాధాన్యత ఉందని భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని భక్తులు, నేతలు తెలిపారు.