ప్రస్తుతం పసిడి పరుగులు బ్రేకులు లేవన్నట్లు పరుగులు పెడుతోంది. దీన్నే సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని విధాలుగా అడ్డుకున్న ఏ మార్గాన అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా గుజరాత్లో ఒక షాకింగ్ వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ నగరంలోని పాల్డి ప్రాంతంలోని ఒక స్టాక్ మార్కెట్ ఆపరేటర్ ఖాళీగా ఉన్న ఫ్లాట్పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి. ఈ దాడిలో బృందం కనుగొన్నది చూస్తుంటే, అధికారుల కళ్ళు బైర్లు కమ్మినట్లు అనిపిస్తుంది.