46 ఏళ్ల  ఉత్కంఠకు తెర.. తెరచుకున్న జగన్నాథ దేవాలయం నిధి..

జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో  కమిటీ సమక్షంలో  గది తలుపులు తెరిచారు. రహస్య గదిలోకి  వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి... ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు.  అందరిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే  టెన్షన్‌. తలుపులు తెరవగానే ఓ ఘటన జరిగనే జరిగింది. ఎస్పీ పినాక్‌ మిశ్రాగదిలో సొమ్మసిల్లి పడిపోయారు . ఐతే ప్రాథమిక చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చారాయన