ఆ గ్రామంలో కోతుల బెడద.. ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ..

: అసలే కోతి.. ఆ పై వనం వీడింది.. జనంలోకి వచ్చింది. గ్రామంలో సెటిలైంది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే వెరైటీ తిండి తింటోంది. గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతుంది. కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట లో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు.