చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌తో కలిసి చర్లపల్లి స్టేషన్‌లో పర్యటించిన ఆయన.. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.