శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం(ఆగస్ట్ 20) రాత్రి నంధ్యాల జిల్లా శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద బండరాళ్లు ఘాట్రోడ్డులో అడ్డంగా పడ్డాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ని కలిపే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.