పాల ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ట్రక్‌.. పాల కోసం ఎగబడ్డ జనాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డుపై ప్రమాదానికి గురైన పాల ట్యాంకర్‌ను స్థానికులు లూటీ చేశారు. ఏబీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని రహదారిపై పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ ప్రేమ్ సింగ్ (45) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి మేరఠ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో లారీ నుజ్జనుజ్జవగా.. పాల ట్యాంకర్‌ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి.