భార్య మృతదేహాన్ని బైక్, డోలి పై స్వగ్రామం తరలించిన భర్త

గంగన్న కుమారుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని డోలి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు. గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది.