ఇప్పటికీ.. మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు కొంత మంది. ఇంట్లో చనిపోతే.. ఏమో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అద్దెకు ఉంటున్న వారు అనారోగ్యంతో బాధ పడితే.. ఆ ఇంట్లోకి రానివ్వడం లేదు యజమానులు. ఇలాంటి సంఘటన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణంలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. దీంతో గత్యంతరంలేక అనారోగ్యానికి గురై, పరిస్థితి విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే స్మశానానికి తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.