రొోడ్డు పక్కన బజ్జీలు, పకోడీ తింటూ చాయ్‌ తాగిన కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా BRS అధినేత KCR ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన..నిన్న ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపి.. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు ఆగారు.హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగారు. కేసీఆర్ ఆగినట్టు తెలుసుకున్న స్థానికులు ఆయనను చూసేందుకు రాగా.. వారితో కాసేపు మాట్లాడారు.