పశ్చిమ గోదావరి జిల్లాలో వింత జీవులు కలకలం సృష్టించాయి. ఆగిరిపల్లి మండలంలో పులి పిల్లలు కనిపించాయి అంటూ దుమారం రేగింది. పులి పిల్లలు కనిపించాయి. పులి వస్తుంది అని ప్రచారం జరగడంతో సగ్గూరు, కృష్ణవరం ప్రాంతాలలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది.