దొండవాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు ప్రయాణికులు గల్లంతు..! ఎట్టకేలకు..

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం హనుమాపురం దగ్గర దొండవాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది... వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కారును వాగు దాటించేందుకు ప్రయత్నించడంతో నీళ్ల వేగానికి కారు కొట్టుకుపోయింది... కొద్దిదూరం కొట్టుకుపోయిన తరువాత అక్కడ వాగు లోతు తక్కువగా ఉండటంతో కారు ఆగిపోయింది... వెంటనే కారులో ఉన్న గోగినేని హనుమంతరావు అనే వ్యక్తి కారు నుంచి బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు..