బొగత జలపాతాలకు నో ఎంట్రీ..!

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడారు. విహార యాత్రలు విషాదాంతం అవుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు.