ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది..

ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది.. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఓవైపు ఎండ ప్రచండం.. మరోవైపు ప్రచార హోరు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది.. హామీలు.. ఓటర్లను ఆకట్టుకోవడం.. ప్రచారం.. సభలు, సమావేశాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంది.. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం తెలుగుదేశం వ్యవస్థాపకుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్.. తెలుగు తమ్ముళ్ల వైపు మళ్లింది.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. తాజాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు.