మానవత్వం, కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మగ దిక్కులేని తన కుటుంబానికి అన్నీతానై నిలబడింది ఓ కోడలు. తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని, తలకొరివి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు, గున్నేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.