యాదాద్రి కొండపైకి స్వయంగా ఆటో నడిపిన ప్రభుత్వ విప్ ఐలయ్య

ఒక ప్రజా ప్రతినిధి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆటో నడుపుకుంటూ వెళ్లారు. అది కూడా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్తుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కొండపైకి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో నడిపారు. యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావులను ఆటోలో ఎక్కించుకుని మరీ కొండపైకి తీసుకెళ్లారు.