అఖిలప్రియ బాడీగార్డ్‎పై దాడి.. భద్రత పెంచిన పోలీసులు..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విజృంభించింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గర్డ్‎పై హత్యాయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పలు చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ పూర్తైనప్పటికీ పగలు చల్లారలేదు. ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు భూమ అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‎పై దాడికి పాల్పడినట్లు కొందరు భావిస్తున్నారు.