ఒక్క రాయితో డ్రైవర్ పంట పండింది..!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. బోయ రామాంజనేయులు, బోయ. శేఖర్లు అన్నదమ్ములు. ఇద్దరు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనులు లేనప్పుడు డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం పొలం పనులకు వెళ్లిన బోయ. రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఇది వజ్రం అని తేల్చి 12 లక్షల రూపాయలు నగదు, 5తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు.