శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ..

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.