తరాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ అనకాపల్లి జిల్లాలో గిరిజన ఆడబిడ్డల ఆవేదనతో ప్రదర్శన చేశారు. తలపై అడ్డాకులు పెట్టుకుని డోలీ మోస్తూ నిరసన తెలిపారు. కొండలు గుట్టలో దాటుకుంటూ.. నాలుగో కిలోమీటర్లు నడిచారు. తమ ఆవేదన వినండి మహాప్రభో అంటూ విన్నవించారు. పాలకులు అధికారుల తీరుపై ఆవేదన చెందుతూ.. తమ కష్టాలు తీరేదెన్నడూ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు ఆ అడవి బిడ్డలు.