జనంలో కలిసి సంఘీభావం తెలిపిన భారతి

జనంలో కలిసి సంఘీభావం తెలిపిన భారతి తాడేపల్లి జంక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సుయాత్రలో వస్తున్న మార్గంలో జనంతో పాటు కలిసిపోయారు భారతి. ఈ సందర్భంగా జనంతో పాటు కలిసిపోయిన భారతి, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. దీంతో ప్రతిగా బస్సులో నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి భారతి అభివాదం చేశారు.