మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సీహెచ్ విద్యాసాగర్ రావు భేటీ

హైదరాబాద్ః మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కలిశారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు శాలువ క‌ప్పి స‌త్క‌రించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా , జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను చెన్నమనేని విద్యాసాగర్ రావు స‌మావేశ‌మ‌వ్వడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అనంత‌రం వీరు రాజ్‌భ‌వ‌న్‌లో కలిసి విందు ఆరగించారు