విద్యుత్ శాఖ అధికారికి.. షాక్ ఇచ్చిన ఓ రైతు..

కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కోసం గుత్తి విద్యుత్ శాఖలో అప్లై చేసుకున్నాడు. ఏడాది కాలంగా రైతు ఆనంద్ చెప్పులు అరిగేలా ఏఈ చంద్రశేఖర్ చుట్టూ తిరిగాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... కొత్త విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం లేదు. ఎందుకు మంజూరు చేయడం లేదని అడిగిన రైతు ఆనంద్ ను లంచం కావాలని డిమాండ్ చేశాడు ఏఈ చంద్రశేఖర్. ఓ ముప్పై వేలు సర్దితే కొత్త విద్యుత్ కలెక్షన్, ట్రాన్స్ఫార్మర్ తెల్లారే సమయంలో మీ పొలంలో ఉంటాయన్నాడు ఏఈ చంద్రశేఖర్.