గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ

వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునేందుకు గతిశక్తి ఉపయోగపడుతుందన్నారు ప్రధాని మోదీ. మరిన్ని నూతన ఆవిష్కరణలను సైతం ఇది ప్రోత్సహిస్తోందని తెలిపారు. దీని ద్వారా దేశం అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.