'బీజేపీ ఎమ్మెల్యేలు 5మంది కాంగ్రెస్‎లోకి వస్తారు'.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమీష్టి కృషితో తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‎లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం వ్యవహారించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల్లో అధికారన్ని వాడుకొని ఇతర పార్టీలను ఇబ్బందికి గురిచేశాయన్నారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.