ఆలయంలో పేలిన సిలిండర్.. పూజారి మృతి.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌

కేరళలోని తిరువనంతపురం జిల్లాలో అక్టోబర్ 11న ఘోర ప్రమాదం జరిగింది. కిలిమనూరు ఆలయంలో జయకుమార్ నంబూతిరి అనే పూజారి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆలయంలోకి వెళ్లగానే గ్యాస్ సిలిండర్ పేలి మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పీ సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.