అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై వాహనదారులుత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ​‌నగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేరు వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.