Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త..మళ్లీ అమల్లోకి వచ్చిన విభూతిధారణ..

శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త..శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన విభూతిధారణ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు విభూతిధారణ చేయించే సంప్రదాయాన్ని ఆలయ ఈఓ పెద్దిరాజు స్వయంగా పునః ప్రారంభించారు. ఆలయానికి వెళ్లే దర్శనం క్యూకాంప్లెక్సు దగ్గర ఈ విభూతి తిలక ధారణను భక్తులకు అందుబాటులో ఉంచారు.