బొప్పాయి పండులో వినాయకుడు ఆకృతి దర్శనం..!

బొప్పాయి పండులో వినాయకుడు ఆకృతి దర్శనం..! కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో వింత చోటు చేసుకుంది. బొప్పాయి పండులో కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. వింత వినాయకుడు అందర్నీ అలరిస్తున్నాడు. బొప్పాయి పండులో వినాయకుడి రూపం దర్శనమివ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తండోప తండలుగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.