ఖమ్మం జిల్లా..లో ఖమ్మం నగరంలోని కరుణగిరి బైపాస్ రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్ష మైంది.. ప్రధాన రహదారి కావడంతో రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసిన వాహనాలు ఎక్కడికక్కడే తమ వాహనాలను నిలిపివేసారు..పాదచారులు. భయ బ్రాంతులకు గురయ్యారు. ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా నెమ్మదిగా రోడ్డు దాటిన కొండచిలువ అక్కడ్నుంచి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. దీంతో వాహన దారులు, పాదచారులు ఊపిరి పీల్చు కున్నారు.