శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి, అమ్మవార్లకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని కోరుకున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అన్నారు