ప్రాణాలకు తెగించి 11 మందిని కాపాడిన NDRF

ప్రాణాలకు తెగించి 11 మందిని కాపాడిన NDRF వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్‌ రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. తాజాగా బీహార్‌లోని కైమూర్ జిల్లాలో కర్కట్ జలపాతంలో చిక్కుకున్న 11 మంది పర్యాటకులను ప్రాణాలకు తెగించి రక్షించారు NDRF టీం. జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా భారీ వర్షం రావడం, అదే సమయంలో జలపాతంలో వరద ప్రవాహం పెరగడంతో పర్యాటకులు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.