కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ సమీపంలో ఉన్న మైత్రి రెస్టారెంట్ కి వేములవాడకు చెందిన రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. వెయిటర్ రాగానే కావలసిన ఫుడ్ కోసం ఆర్డర్ తీసుకున్నాడు. రోటితోపాటు ఇతర కర్రీస్, వెజిటేబుల్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. అయితే వెజిటేబుల్ రైస్ రెండు స్పూన్లు తిన్న తర్వాత అందులో ఒక బొద్దింక దర్శనం ఇచ్చింది. ఇది చూసిన కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు బొద్ధింకతో పాటు అక్కడక్కడ వెంట్రుకలు కూడా కనబడ్డాయి. దీంతో రాజు కుటుంబ సభ్యులు వెంటనే ఆఫుడ్ను అక్కడే వదిలేశారు.