హాట్‌హాట్‌గా సాగిన పార్లమెంటు అఖిలపక్ష భేటీ..!

జాతీయ రాజకీయాల్లో రేపు సూపర్‌ మండే. జూలై 22న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు, అంటే, జూలై 21 అదివారం, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌తోపాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సర్వసభ్య ఈ పార్లమెంట్ సెషన్‌లో ప్రభుత్వ ఎజెండా, బిల్లులను ప్రభుత్వం రాజకీయ పార్టీలకు తెలియజేసింది. దీంతో పాటు పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా విపక్షాలను కూడా ప్రభుత్వం కోరింది.