టీవీ9 వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము అర్భకులం కాదు..అర్జునులమై పోరాడాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు.