బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చెలరేగిన హింస Bangladesh - Tv9 బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్ధులు భారీ ఆందోళన చేపట్టారు. ఆదివారం చెలరేగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోయారు. హింసలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్లైన్ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిముషాల డెడ్లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు.