ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఫరూఖాబాద్లోని అమృత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా 22 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.