మెట్రో రైలులో హైదరాబాద్ మేయర్ సందడి..!

హైదరాబాద్‌ మేయర్ మెట్రో రైలులో సందడి చేశారు. మూసారంబాగ్ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూసారంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. గణేష్ నిమజ్జనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక మెట్రో రైల్ సర్వీసుల పొడిగింపుపై మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి మేయర్ మెట్రో రైలులో ప్రయాణించారు.