జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన దారుణం ఇది.

జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన దారుణం ఇది. బీచుపల్లి పదవ పొలీస్‌ బెటాలియన్ దగ్గర అర్థరాత్రి హాహాకారలు ఇవి. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న బస్సు బోల్తా పడింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు చనిపోయింది. ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40-50మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూల్, గద్వాల్ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది.