రైతు భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతుంది. శనివారం గ్రూప్ వన్ అభ్యర్థుల ధర్నాతో హైదరాబాద్‌ దద్దరిల్లితే.. ఆదివారం అన్నదాతలు, గులాబీ నేతల నిరసనలతో రాష్ట్రంలోని అన్నిమండలకేంద్రాలు హోరెత్తాయి. ఖరీఫ్‌లో రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్‌ నేతలు.