విమానంలో పొగలు.. 280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా..

280 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం రెక్కల నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం మొదలైంది. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 9.50గంటల ప్రాంతంలో ప్రయాణికులు విమానంలోకి ఎక్కేముందు విమానంలో పొగలు రావడంతో అంతా భయబ్రాంతులకు గురయ్యారు.