నాలుగు రాష్ట్రాలను వణికిస్తున్న దానా తుఫాన్

ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను దానా తుఫాన్‌ భయపెడుతోంది. గురువారంనాడు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, శుక్రవారం తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.