కాలభైరవ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. భైరవ కొండ విశిష్టత ఏమిటంటే

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్ పల్లిలో కాలభైరవ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు భైరవ కొండకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కాల భైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు