రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఓ దారుణమైన వార్త వెలుగులోకి వచ్చింది

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఓ దారుణమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను బైక్‌ వెనుకకు కట్టేసి ఊరంతా ఈడ్చుకెళ్లాడు ఆమె భర్త. ఈ ఘటనను స్థానికులు ఎవరో వీడియో తీయగా, అది వైరల్‌గా మారింది. దీంతో ఒక నెల రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ వారి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.