భారత్‌-చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం!

భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రభావం తూర్పు లడఖ్‌లో కనిపించడం ప్రారంభమైంది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) దగ్గర ఇరు దేశాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యాలు తమ సైనికులను తిరిగి రప్పించే పనిలో నిమగ్నమై ఉన్నాయని, ఈ ప్రక్రియ సజావుగా సాగుతోందని చైనా తెలిపింది.