ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్​లో 'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌ లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు.