అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో రెండోవ విడత సాత్విక బలులను సమర్పించారు. అలానే మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. అంతకుముందు శ్రీ మల్లి కార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర శొంటి భక్షాలతో కప్పేశారు.